ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: కృష్ణ- గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి, పిడిఎఫ్ అభ్యర్థి కేసు లక్ష్మణరావు పై 82,230 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో సోమవారం నుంచి జరిగిన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయానికి ముగిసింది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ప్రతి రౌండ్ కు ఆలపాటికి ఆధిక్యం లభించింది. ఆరు జిల్లాలు, 33 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మొత్తం 2,41,774 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ లో 2,14,865 చెల్లుబాటు కాగా ,చెల్లని ఓట్లు 26,909. కూ టమి అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు1,45,057 ఓట్లు రాగా, పిడిఎఫ్ అభ్యర్థి కే ఎస్ లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.
ఓట్ల లెక్కింపు పూర్తయిన సందర్భంలో ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తన సమీప ప్రత్యర్థి కేఎస్ లక్ష్మణ రావు పై 82,320 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ నాగలక్ష్మి తెలిపారు.