హైదరాబాద్: నీటి పారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్లోని ఆయన నివాసంలొ ఏసీబీ నేడు అదుపులోకి తీసుకుంది.
ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ కరీంనగర్, జహీరాబాద్.. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.