పంచరామాలు కిటకిట…
శ్రీశైలంలో భక్తుల పోటు
వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు
ఎపిలో మహా శివరాత్రి శోభ
శోభయమానం కృష్ణా తీరం..
పుణ్యస్నానాలతో పులకరించిన కృష్ణమ్మ..
శివనామస్మరణతో మారు మ్రోగిన శైవక్షేత్రాలు…
భక్తిశ్రద్ధల మధ్య శివరాత్రి వేడుకలు..
పితృదేవతలకు పిండ ప్రదానాలు…
శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు…
ఎపి వ్యాప్తంగా వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ…
వెలగపూడి/ నంద్యాల/ ఎన్టీఆర్ జిల్లా బ్యూరో . మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎపి లోని శివాలయాలలో భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధ పంచారామాలలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే శ్రీశైలానికి భక్తులు .బుధవారం వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు పున్య స్నానాలు ఆచరించి.. క్యూ లైన్లలో నిలుచుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు పున్య స్నానాలు ఆచరించి.. క్యూ లైన్లలో నిలుచుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది.
ఆలయ అధికారులు శివ స్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నల్లమల అడవుల్లో కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ ఏడాది ప్రభుత్వం మల్లన్న భక్తులకు లడ్డూ ప్రసాదం, మంచినీరు, చిన్న పిల్లలకు పాలు అల్పాహారం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాత్రి పది గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్బంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
.శ్రీగిరికి తరలి వస్తున్న భక్తులు..
మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నల్లమల గిరులు శివనామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి.. ఇక మహాశివరాత్రి సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలం శ్రీగిరికి తరలి వస్తున్నారు. ఇక ఇక్కడ జరిగే వేడుకలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పూలు, విద్యుద్దీపాల అలంకరణతో ప్రధాన ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది.
నేటి కార్యక్రమాలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5:30 గంటలకు ప్రభోత్సవం, రాత్రి 7గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్ధరాత్రి వేళ పాగాలంకరణ, స్వామిఅమ్మవార్లకు కల్యాణమహోత్సవం నిర్వహిస్తారు.
ఎంతో ప్రత్యేకం.. పాగాలంకరణ
మహాశివరాత్రి వేడుకల సందర్భంగా లింగోద్భవ కాలంలో జరిగే శ్రీశైలంలో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం మూడు తరాలుగా మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని పృథ్వీ కుటుంబం నేస్తుంది. కల్యాణోత్సవానికి ముందు వరుడు మల్లన్నకు తలపాగా చుట్టే తీరు అద్భుతంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున చిమ్మ చీకట్లో స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, నవ నందులను కలుపుతూ పాగాను అలంకరిస్తారు.
శ్రీకాళహస్తిలో…

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బుధవారం జరిగే మహాశివరాత్రి వేడుకలు ప్రారంభ మయ్యాయి .. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తొలుత దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం స్థానిక శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమాభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఆలయం దేశవ్యాప్తంగా శివ భక్తులకు ఆధ్యాత్మికంగా కీలక కేంద్రంగా వుందని, ప్రభుత్వం తరఫున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనార్థం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. భక్తుల మనోభావాలను కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. క్తులకు తొలిసారిగా ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు.
కోటప్పకొండలో ప్రభల సంబరం
మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. దేశ నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. కోటప్పకొండపై కొలువై వున్న త్రికోటేశ్వర స్వామికి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ ప్రారంభమైంది. ఆలయ పూజారులు బిందెతీర్థంతో స్వామి వారికి అభిషేకం చేశారు. తొలిపూజకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే అరవిందబాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు.
మూడు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున స్వామికి దేవదాయ మంత్రి ఆనం పట్టువస్త్రాలను సమర్పించారు. ఇక నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ నుంచి ఆర్టీసీ 550 ప్రత్యేక బస్సులను నడపుతోంది. బుధవారం తెల్లవారుజాము 2గంటలకు బిందె తీర్థంతో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. 19 భారీ విద్యుత్ ప్రభలు తిరునాళ్లలో కాంతులీననున్నాయి. కోటప్పకొండ దిగువన, దేవస్థాన ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
పంచరామాలలో భక్తుల కిటకిట ..
ఇక పంచారామాలైన అమరావతి (అమరారామం), భీమవరం (భీమారామం), పాలకొల్లు (క్షీరారామం), ద్రాక్షారామం, సామర్లకోట (కుమారారామం) క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతున్నాయి.
కృష్ణానదీ తీరాన ప్రతిధ్వనించిన పంచాక్షరి మంత్రం…

ఎన్టీఆర్ జి్లాలలోని కృష్ణమ్మ నది చెంత పుణ్యస్నానాలు… పితృదేవతలకు తర్పణం.. శంఖం పూరించే జంగమ దేవరల సందడి… ముక్కంటి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.. తెల్లవారుజాము నుండే ప్రత్యేక అభిషేకాలు, పూజలు… మారు మోగిన శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. హర హర మహాదేవ.. శంభో శంకర.. పాహిమాం పాహిమాం అంటూ పంచాక్షరి మంత్రం జిల్లా వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన శివరాత్రి వేడుకలను భక్తులు పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహించుకున్నారు. యావత్ భక్తకోటి మనసారా ఆరాధించే పరమ పవిత్రమైన పుణ్య దినం మైన బుధవారం శివరాత్రి రోజు తెల్లవారుజాము నుండే భక్తులు పుణ్యస్నానాల కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలతో నగరంలోని ఘాట్లన్నీ కిటకిటలాడాయి. పుణ్యస్నానాల అనంతరం ఘట్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలలో పితృదేవతలకు పిండ ప్రధానం తర్పణాలను వదిలిన భక్తులు, నిరుపేదలకు దానధర్మాలను చేశారు. అలాగే పరమశివుని దర్శనం కోసం సమీప ప్రాంతాలలో ఉన్న శివాలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలను అభిషేకాలను అర్చనలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో బుధవారం వేకువ జాము నుండే మహా రుద్రాభిషేకాలు, కుంబాభిషేకాలతో పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. శివాలయాల్లో పరమశివునికి ప్రత్యేక పూజాభిషేకాలు చేసేందుకు వచ్చిన భక్తుల రద్దీతో ఆలయాలన్నీ కిక్కిరిశాయి. భక్తుల రాకదృష్ట్యా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా ఆయా ఆలయ కమిటీలు ఏర్పాటు చేశాయి. అలాగే స్నానగాట్ల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను చేసింది.తున్నాయి.