Visranthi Sadan | త్వరలో ‘విశ్రాంతి సదన్’ నిర్మాణం..

Visranthi Sadan| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో రోగుల బంధువుల కోసం ప్రతిపాదించిన ఆధునిక ‘విశ్రాంతి సదన్’ నిర్మాణానికి సన్నాహాలు వేగవంతమయ్యాయి. రూ.14.6 కోట్ల వ్యయంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (CSR) నిధుల ద్వారా, (NBCC) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ అడిషనల్ డీ.ఎం.ఇ & సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సమీపంలో నిర్మించనున్న ‘విశ్రాంతి సదన్’ మాస్టర్ ప్లాన్ నమూనా, డిజైన్‌లను పవర్ గ్రిడ్ అధికారులు, (NBCC) ఆర్కిటెక్ట్‌లతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు.

ప్రాజెక్ట్ ముఖ్య అంశాలు:

  1. G+3 అంతస్తుల ఆధునిక వసతి భవనం
  2. 150 పడకల సామర్థ్యం
  3. సింగిల్ రూములు, ట్విన్ రూములు, డార్మిటరీలు, మహిళా వసతి గదుల ఏర్పాటు
  4. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల అటెండెంట్లకు సురక్షితమైన, పరిశుభ్రమైన వసతి
  5. ప్రతి అంతస్తులో సౌకర్యవంతమైన గదుల విభజన, అవసరమైన అన్ని భౌతిక సదుపాయాలు

ఈ ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి అవుతుందని డీ.ఎం.ఇ పేర్కొన్నారు. జీజీహెచ్ పరిసరాల్లో వసతి సమస్యను అధిగమించే కీలక ప్రాజెక్టుగా ‘విశ్రాంతి సదన్’ నిలవనుందని, పవర్ గ్రిడ్ (CSR) సహకారంతో కర్నూలుకు మరో ప్రాధాన్యత కలిగిన ప్రజాసేవ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ సమీక్ష కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, పవర్ గ్రిడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి, (NBCC) డిప్యూటీ జీఎం (ఇంజనీరింగ్) అబ్దుల్ రహీమ్, ఆర్కిటెక్ట్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply