ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని కిశ్త్వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ (cloudburst).. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లా (Kathua District)లోని ఓ మారుమూల గ్రామంలో మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
జమ్మూకశ్మీర్లో మళ్లీ విస్ఫోటం.. నలుగురు మృతి
