Delhi | సంయ‌మ‌నం పాటించండి.. ఇరాన్ – ఇజ్రాయెల్ ల‌కు భార‌త్ హిత‌వు

న్యూ ఢిల్లీ : పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ (Iran) అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) భీకరదాడులు చేసింది. దీనికి ప్ర‌తిగా ఇరాన్ కూడా 100 డ్రోన్లతో ఇజ్రాయెల్ పై ఎదురుదాడికి దిగింది. ఈ నేప‌థ్యంలోనే భారత్ (India).. ఇరు దేశాలకు కీలక సందేశం పంపించింది. ఇరాన్-ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని కోరింది. సాధ్యమైనంత మద్దతును అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉద్రిక్తతలను తగ్గించి.. చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అన్ని పరిస్థితుల్ని గమనిస్తున్నామని.. అవసరమైతే ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ముందుకొస్తుందని ప్రకటించింది. ఏ సమస్యకైనా పరిష్కారం దౌత్య మార్గాలేనని తెలిపింది.

భార‌తీయులు.. అప్ర‌మ‌త్తంగా ఉండండి..
ఇక భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని.. అనవసర ప్రయాణాలు ఆపుకోవాలని భారత్ సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు (Indian Embassies) అప్రమత్తమ‌య్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *