(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్బంగా విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుండి ఆదివారం సాంప్రదాయ బద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు.
తరతరాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా చిన్న వెంకన్న స్వామి వారికి కనకదుర్గ గుడి ఆలయ కార్యనిర్వాహణాధికారి, డిప్యూటీ కలెక్టర్ వి.కె.శీనానాయక్ దంపతులు,వేద పండితులు ఆదివారం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి దంపతులు, ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులను ద్వారకా తిరుమల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎన్. వి. ఎస్. ఎన్. మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం పేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో మూర్తి స్వామి వారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గగుడి ప్రధాన అర్చకులు లింగంబొట్ల దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.