TG | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గిరిజన యూనివర్శిటీ వీసీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ములుగు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ ని ఉపకులపతి శాలువాతో సన్మానించి సత్కరించారు. నూతన వీసిగా నియామకమైన శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమక్రమంగా నెరవేర్చాలని సూచించారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *