5,802 people Cancer | చిత్తూరు జిల్లాలో మహమ్మారి!
- 3 నెలల్లో 3 లక్షల మందికి కేన్సర్ స్క్రీనింగ్
- వేలాది మందికి వ్యాధి నిర్ధారణ
- వైద్యశాఖలో ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
- చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న కేసులు
Cancer | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో కేన్సర్ వ్యాప్తి భయానకసాయికి చేరుకుంటోందన్న సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా మెగా కేన్సర్ స్క్రీనింగ్(Mega Cancer Screening) కార్యక్రమం నిర్వహించిన ఆరోగ్య శాఖ, మొత్తం 2,99,610 మంది ప్రజలకు -పరీక్షలు చేసింది.
5,802 people Cancer | పాలకవర్గాలను ఉలిక్కిపడేలా

ఈ విస్తృత స్థాయి పరీక్షల్లో వచ్చిన ఫలితాలు జిల్లా వైద్యవ ర్గాలను, పాలకవర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి. స్క్రీనింగ్ కు హాజరైన వారిలో 5,802 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడం జిల్లాలో ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాపిస్తోందో మరోసారి స్పష్టంగా చెప్పింది.

