3-Member-Committee : రంగంలోకి కేంద్ర​ కమిటీ Andhra Prabha Spl News

3-Member-Committee : రంగంలోకి కేంద్ర​ కమిటీ Andhra Prabha Spl News

  • విశాఖకు చేరిక.. పరిస్థితిలపై సమీక్ష
  • స్టీల్​ ప్లాంట్​ ప్రమాదంపై విచారణ

( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో!

3-Member-Committee : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన త్రీ మెన్ కమిటీ రంగంలోకి దిగింది. బొకారో సెయిల్​ డైరెక్టర్​ ఇన్​ చార్జి ప్రియారంజన్​, సెయిల్​ సీజీఎం జితేంద్ర కుమార్​, సెయిల్​ మాజీ సీజీఎం గోపాల్​ సింగ్​ ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ​బొకారో నుండి త్రీ మెన్ కమిటీ సభ్యులు విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 4.30కి ​విశాఖ స్టీల్ ప్లాంట్‌లో త్రీ మెన్ కమిటీతో భేటీ కానున్న కేంద్ర ఉక్కు భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ​ప్రమాదానికి గల కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై కమిటీ సభ్యులతో కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ సమీక్షిస్తారు.

Leave a Reply