శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

హుండీ ఆదాయం రూ. 4.42 కోట్లు
తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం ప‌డుతోంద‌ని ఆల‌య అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వ దర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి ద‌ర్శ‌నానికి వేచి చూస్తున్నారు. మంగ‌ళ‌వారం శ్రీవారిని 67,091 మంది భక్తులు ద‌ర్శంచుకున్నారు. 21,111 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.42 కోట్లు వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.

Leave a Reply