Monday, July 1, 2024

BRS – దొంగలతో కలిసే వారి గురించి బాధలేదు … మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిస్తాం – కెసిఆర్

ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో చేవెళ్ళ ఎంఎల్ఏ . యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. .కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపులపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ఉల్లంఘించిందని ఆ పార్టీ విమర్శిస్తోంది.ఈ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని తెలిపారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. పార్టీని వీడి దొంగలతో కలిసేవారి గురించి బాధలేదన్నారు. తెలంగాణ సాధించిన మనకు ఇలాంటి ఒడిదుడుకులు ఓ లెక్కనా అని కేసీఆర్ అన్నారు

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, జీవన్‌ రెడ్డి, జాజాల సురేందర్‌, గంప గోవర్దన్‌, హన్మంత్‌ షిండే, ఎల్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆయన వదిలి వెళ్లిపోయారన్నారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన లేరని.. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారని విమర్శించారు. అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement