Sunday, June 30, 2024

TG | ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నిరాశ.. బెయిల్‌కు నాంపల్లి కోర్టు నో…

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నిందితులకు మరోసారి చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

- Advertisement -

బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కోర్టులో చార్జిషీటు లేదని… అరెస్టు చేసిన 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకుంటే బెయిల్ మంజూరు చేయవచ్చన్న నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే 90 రోజులలోపే చార్జిషీట్‌ దాఖలు చేశామని పోలీసుల తరఫు న్యాయవాదులు తెలిపారు. చార్జిషీటును కోర్టు వెనక్కి పంపిందని… ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement