Sunday, June 30, 2024

TG | రేపు సీఎం రేవంత్ వ‌రంగల్ ప‌ర్య‌ట‌న.. మంత్రి కొండా సురేఖ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యకలాపాలు సాగిస్తున్నార‌ని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు (జూన్ 28న) సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వస్తున్నందున మంత్రి సురేఖ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు రేవంత్ రెడ్డి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ చేరుకుంటారని తెలిపారు. వరంగల్‌లో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై అధికారులతో సీఎం సమీక్షిస్తారని తెలిపారు. వరంగల్‌లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా రేవంత్ రెడ్డి సందర్శిస్తారని కొండా సురేఖ తెలిపారు.

అటు హన్మకొండ కలెక్టరెట్ పరిధిలో కూడా వివిధ పనులపై రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తారని వెల్లడించారు. హన్మకొండ అభివృద్ది పనులపై, వరంగల్ మాస్టర్ ప్లాన్ అంశంపై రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారని చెప్పారు. గత ప్రభుత్వ హాయాంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసినదని.. దాన్ని మార్చాల్సి ఉందని అన్నారు.

మరో 3 నెలల కాలవ్యవధిలో వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల అంశంపై కూడా చర్చ ఉంటుందని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశం చర్చిస్తామని మంత్రి తెలిపారు.

రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎంకు నివేదించాల్సిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.

- Advertisement -

సీఎం పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్‌ను పర్యవేక్షించాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కలెక్టర్లు సత్య శారదాదేవి, ప్రవీణ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement