Friday, March 29, 2024

లారీ – బైక్ ఢీః ఒక‌రి మృతి…

ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు హైవే పెట్రోలింగ్, పోలీస్ పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం వైపు నుండి రాజమహేంద్రవరం వైపుకు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దర్నీ అదే మార్గంలో వెళ్తున్న లారీ వెనుక నుండి ఢీ కొనడంతో అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన కందాల శ్రీనివాస్ (45) సంఘటనా స్థలంలోనే మృతిచెందగా అంబాజీపేట మండలం పోతాయిలంకకు చెందిన ముాలపర్తి నారాయణమూర్తికి తీవ్ర గాయాలు అయినట్లు వారు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆలమూరు ఏఎస్సై సూర్య సుందర్రావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన సూర్యనారాయణ మూర్తిని హైవే అంబులెన్స్పై రాజమహేంద్రవరం తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా హైవే పెట్రోలింగ్, పోలీసులు పెట్రోలింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు ఆలమూరు ఏఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement