Tuesday, April 16, 2024

నెల్లూరు జిల్లాలో వైసీపీ కౌన్సిలర్ దారుణహత్య.. పుట్టినరోజే చంపేసిన దుండగులు

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. సూళ్లూరుపేటలో సోమవారం పట్టపగలే వైసీపీ కౌన్సిలర్ తాళూరు సురేశ్(40) దారుణ హత్యకు గురయ్యారు. కారు పార్క్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పుట్టినరోజు నాడే సురేష్ హత్యకు గురికావడం గమనార్హం. ఆగస్టు 9 సురేష్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం సాయంత్రం సమయంలో తిరిగి సూళ్లూరుపేటకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దింపిన సురేష్.. సమీపంలోని రైల్వే కేబిన్ రోడ్డులో కారును పార్క్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని అగంతకులు కత్తులతో ఆయనపై దాడికి తెగబడ్డారు.

చాలాసేపటి వరకు సురేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పార్కింగ్ ప్రదేశానికి వెళ్లి చూడగా సురేష్ రక్తపు మడుగులో పడి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం​ గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే కీలక ఆధారాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పక్కా ప్లాన్‌తోనే సురేష్‌ను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సురేష్ హత్యను స్థానిక వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత.. నిరాశగా వెనుదిరుగుతున్న ప్రజలు

Advertisement

తాజా వార్తలు

Advertisement