Friday, April 19, 2024

అవినీతి లేని పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి గుమ్మనూరు జయరాం

ఆలూరు : అవినీతి లేని పాలన అందించడమే తమ పార్టీ ధ్యేయ‌మ‌ని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో సర్పంచ్ మోక సిద్ధమ్మ అధ్యక్షతన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూల మాలతో, టపాసులతో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆహ్వానం పలికారు. అనంతరం నూతన ఆర్ బీ కే కార్యాలయాన్ని, గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడు కోట్లు వివిధ సంక్షేమ పథకాలకు అందజేశామని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా లక్ష ముప్పై వేలు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులుగా అవకాశం కల్పించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement